రఘుదేవపురంలో జనం కోసం జనసేన మహాపాదయాత్ర 2వ రోజు

  • రఘుదేవపురం గ్రామంలో రెండవ రోజు “జనం కోసం జనసేన మహాపాదయాత్ర” లో పాల్గొన్న “బత్తుల”
  • హారతులతో ఘన స్వాగతం పలికిన రఘుదేవపురం గ్రామ ప్రజలు
  • అవినీతి పాలన అంతమొందిద్దాం.. ప్రజా పరిపాలన తెచ్చుకుందాం.. “బత్తుల”
  • రాష్ట్రము అభివృద్ధి చెందాలన్నా.. ప్రజల జీవితాలు బాగుపడాలన్నా పవన్ కళ్యాణ్ ద్వారా మాత్రమే సాధ్యం
  • నిత్యం ప్రజల్లో ఉంటూ, ప్రజల్లో తిరుగుతూ ప్రజల కష్టాలు తెలుసుకుంటున్న బత్తుల కుటుంబానికి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ

రాజానగరం: సీతానగరం మండలం, రఘుదేవపురం గ్రామంలో జనం కోసం జనసేన మహాపాదయాత్రలో భాగంగా నేడు గ్రామంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రతీ గడపకూ వెళ్ళి అధికార వైసీపీ వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు, బాధలు తెలుసుకుంటూ.. రాబోయే ఎన్నికలలో దుర్మార్గపు అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దింపి జనసేన పార్టీని గెలిపించుకుని ప్రజా పరిపాలన తెచ్చుకుందాం అని జనసేన పార్టీ సిద్దాంతాలు ప్రజలకు వివరించిన “జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కో-ఆర్డినేటర్” శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి, వారి కుమార్తెలు శ్రీమతి ప్రత్యూషాదేవి, వందనాంబిక.. ఈ పాదయాత్రలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు, రఘుదేవపురం గ్రామ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు భారీగా పాల్గొన్నారు.