పంతం నానాజీ సమక్షంలో జనసేనలో చేరికలు

కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామం తారక రామ నగర్ ప్రాంతానికి చెందిన వైసీపీ నాయకులు నాగోజు చిన్నా, పెంటబోయిన నాగరాజుల నాయకత్వంలో జనసేన యువ నాయకులు శాండీ ఆధ్వర్యంలో 20 మంది యువకులు నేడు కాకినాడ గొడరిగుంటలో జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వీరందరికి పార్టీ కండువాలు వేసి సాధారంగా ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.