అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాట తప్పిన జగనన్న

  • అంగన్వాడీ వర్కర్లకు 26వేల రూపాయల గౌరవ వేతనంతో పాటు సుప్రీంకోర్టు చెప్పిన విధంగా గ్రాట్యుటరిని చెల్లించాలి
  • అంగన్వాడీల న్యాయపరమైన డిమాండ్ల అమలుకు జనసేన పార్టీ సంపూర్ణంగా మద్దతుగా ఉంటుంది
  • జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు అర్బన్ ఇంచార్జ్ టి.సి వరుణ్ మరియు రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత

అనంతపూర్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అంగన్వాడిలందరూ వారి యొక్క ప్రధానమైన డిమాండ్ల అమలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా నిన్నటి నుంచి అనంతపురం కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా అంగన్వాడి వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేస్తున్న శాంతియుత సమ్మె కార్యక్రమానికి జనసేన పార్టీ తరపున పాల్గొని వారికి సంఘీభావం తెలిపిన జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు మరియు అర్బన్ ఇంచార్జ్ టి.సి వరుణ్ మరియు రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలముందు పాదయాత్రలో భాగంగా అంగన్ వాడి వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్లు ఆయనను కలిసి వారి సమస్యలు చెప్పినప్పుడు మీకు జగనన్న ఉన్నాడు అధికారంలోకి వస్తానే మీ జీతాలు పక్క రాష్ట్రం తెలంగాణ కంటే 1000 రూపాయలు ఎక్కువగానే ఉండేటట్లు చేస్తానని రిటైర్ అవ్వగానే 5లక్షల డబ్బులు వచ్చేలా చేస్తామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా రిటైర్ అమౌంట్ 50వేలు మాత్రమే వస్తుందని జీతాలు పక్క రాష్ట్రం తెలంగాణలో 14,500 వస్తుంటే మన రాష్ట్రంలో అంతకంటే తక్కువగా 11,500 రూపాయలు మాత్రమే ఇస్తూ అంగన్ వాడీ అక్కా చెల్లెమ్మాలను పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ ముఖ్యమంత్రి ఇంకా అనేక గ్రామాలలో అంగన్వాడి సెంటర్స్ కి సొంత భవనాలు లేవు బాడుగకు ఉన్న అంగన్వాడి సెంటర్స్ లో ప్రభుత్వం సరైన సమయంలో బాడుగలు చెల్లించక పోవడంతో గృహ ఏజమాని ఎక్కడ సెంటర్ని కాలి చేపిస్తాడోనన్న భయంతో అంగన్వాడి వార్కర్లే అప్పు చేసి బాడుగాలు కట్టే పరిస్తితి రాష్ట్రంలో ఉందని సుప్రీంకోర్టే అంగన్వాడిలకి గౌరవ వేతనం 26వేల రూపాయలు ఇవ్వాలని గ్రాట్యుటరిని అమలు చేయాలని చెప్పింది కానీ జగన్ రెడ్డి వీటిని ఏపాత్రం పెడచెవిన పట్టించుకోకుండ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ అంగన్వాడిల జీవితాలతో ఆడుకుంటున్నాడని మేము జనసేన పార్టీ తరపున ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము అంగన్వాడిల న్యాయపరమైన కోరికలు తీర్చే వరకు వీరి సమ్మెకు జనసేన పార్టీ తరపున మద్దతుగా ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు జయరామిరెడ్డి అంకె ఈశ్వరయ్య, నగర అధ్యక్షుడు బాబు రావు, జిల్లా ప్రధాన కార్యదర్శులు పత్తి చంద్రశేఖర్, కుమ్మర నాగేంద్ర, జిల్లా కమిటీ సభ్యులు అవుకు విజయ్ ముప్పురి కృష్ణ, నగర కమిటీ సభ్యులు పెండ్యాల చక్రపాణి, వళ్ళంశెట్టి వెంకట రమణ, లాల్ స్వామి, హుస్సేన్, ఆకుల అశోక్, సంపత్ కుమార్, కార్యనిర్వహక సభ్యులు సంతోష్ కుమార్ వీరమహిళలు శైలజ, గాయత్రి, ఆసీద్, చంద్రకళ, సానియా, అనసూయ, అంజలి, అరుణ జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.