అంగన్వాడీ టీచర్ల సమస్యలను పరిష్కరించాలి: మెరుపుల మహేష్

నగరి నియోజకవర్గం, నగరి మండలం నగరి వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ వారు నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో మెరుపుల మహేష్ మాట్లాడుతూ అంగన్వాడి ఉద్యోగుల కనీస వేతనాలు 26,000 ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటి అమలు చేయాలని, హెల్పర్స్ ప్రమోషన్లు నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని, వాళ్ళు చేసిన ధర్నా కార్యక్రమంలో పాల్గొని వారికి సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు మూస, నగిరి మండల అధ్యక్షుడు దేవా, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రోగ్రాం కమిటీ కార్యదర్శి కటికం నాగార్జున, నగరి మండల ప్రధాన కార్యదర్శులు గిరి, మోహన్, సర్దార్, కళ్యాణ్, భాస్కర్, అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు.