జనసేనానిని మర్యాదపూర్వకంగా కలిసిన బొంతు దంపతులు

మంగళగిరి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు మరియు శ్రీమతి అరుణ కుమారి దంపతులు శుక్రవారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిస్థితులపై చర్చించడం జరిగింది.