నాసిరకంగా జగనన్న ఇళ్ల నిర్మాణం

నూజివీడు: జనసేన పార్టీ ఆధ్వర్యంలో 100 రోజులు 100 సమస్యల్లో భాగంగా శనివారం జగనన్న ఇళ్ల పేరు మీద కాంట్రాక్టర్ కి అప్పజెప్పిన ఇల్లు పూర్తి నాసిరకంగా నిర్మించి పేదల ఉసురు పోసుకుంటున్నారని ప్రభుత్వం ఇచ్చే 1,80,000 రూపాయలకు తోడు లబ్ధిదారుల దగ్గర నుండి 35000 వసూలు చేస్తున్న కాంట్రాక్టర్ 2 అడుగుల లోతుల్లో ఆగరాలలో 4 పిల్లర్లు వేసి చేపట్టిన ఇల్లు నాసిరకం సిమెంటు, నాసిరకం సిమెంట్ రాళ్లు, నాసిరకం మెటీరియల్ తో నిర్మిస్తున్న ఇల్లు ప్రజలకి భవిష్యత్తులో కన్నీళ్ళే మిగిలిస్తాయని జనసేన నాయకులు ముత్యాల కామేష్, ముమ్మలనేని సునీల్ కుమార్ ఆవేదన ఆగ్రహం వ్యక్తపరిచారు. ఇలాంటి నాసి రకము నిర్మాణాలపై త్వరలోనే విజిలెన్స్ కి కంప్లీట్ చేస్తాము అని కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకునేదాకా జనసేన పార్టీ తరపున పోరాటం చేస్తాము అని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ముమ్మలనేని సునీల్ కుమార్, ఇంటూరి చంటి, నాయుడు శీను తదితరులు పాల్గొన్నారు.