యల్లటూరు శ్రీనివాసరాజు ఆద్వర్యంలో జనసేన పార్టీలో చేరికలు

ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని నందలూరు, రాజంపేట మండలంలోని వివిధ పార్టీల నాయకులు రాజంపేట జనసేన పార్టీ నేత‌ యల్లటూరు శ్రీనివాస రాజు ఆద్వర్యంలో పలువురు ప్రముఖులు జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ నేత యల్లటూరు శ్రీనివాస రాజు రాజంపేట పట్టణం యల్లటూరు భవన్ జనసేన పార్టీ కార్యాలయం నందు వారికి జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాజంపేట జనసేన పార్టీ నేత యల్లటూరు శ్రీనివాస రాజు మాట్లాడుతూ నందలూరు, రాజంపేట మండలాల నుంచి వివిధ పార్టీల నాయకులు జనసేన పార్టీకి మద్దతుగా వచ్చినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ జనసేన పార్టీ గెలుపుకు కృషి చేయాలని కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పార్టీలో తగిన స్థానం కల్పిస్తామని జనసేన-టిడిపి అలియన్స్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక ప్రజల సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని ప్రజలకి మీ ద్వారా నమ్మకం, భరోసా ఇవ్వాలని తెలిపారు. కొత్తగా చేరిన వారిలో మాజీ జెడ్పీటీసీ యల్లటూరు శివరామరాజు, సీనియర్ నాయకులు శింగంశెట్టి నరేంద్ర,కాంగ్రెస్ పార్టీ నుంచి నాసిర్ ఖాన్, వైఎస్ఆర్సిపి నుంచి పత్తి నారాయణ, వైఎస్ఆర్సిపి నుంచి షేక్ సలీం, చిట్టే భాస్కర్, నారదాసు రామచంద్ర, ముస్లిం మైనారిటీ నాయకులు మహమ్మద్ రఫీ, బుర్లకుంట గోపాలకృష్ణ, వైఎస్సార్సీపీ నుంచి ఇటుకల రాజా చారి, రాజ బోయిన గోవర్ధన్, చింతల శివకుమార్, సింగమల సాయిరాం, ఎర్రా వాసుదేవ రావు, కిరణ్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో నందలూరు మండల జనసేన నాయకులు గురివి గారి వాసు, ప్రశాంత్, సిద్ధవటం మండలం జనసేన నాయకులు కొట్టే రాజేష్, పసుపులేటి కళ్యాణ్, ఆవుల రాజా, ఒంటిమిట్ట జనసేన పార్టీ నాయకులు కట్టా మల్లి, సుధాకర్, జనసైనికులు మరియు ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు.