పొన్నూరులో జనసేన జెండా ఆవిష్కరణ

పొన్నూరు పట్టణ అధ్యక్షులు షేక్ కరీముల్లా, ఉపాధ్యక్షులు మల్లెబోయిన గోపికృష్ణ ఆధ్వర్యంలో 1, 2 వార్డుల్లో ఏర్పాటుచేసిన జనసేన జెండా దిమ్మ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, పొన్నూరు జనసేన-టిడిపి సంప్రదింపుల సమన్వయ బాద్యులు వడ్రాణం మార్కండేయలు నూతన జెండా దిమ్మలను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఆడపా మాణిక్యాలరావు, తాలూరి అప్పారావు, మేకల రామ యాదవ్, దేశంశెట్టి సూర్య, పొన్నూరు మండల అధ్యక్షుడు నాగిశెట్టి సుబ్బారావు, పట్టణ ఉపాధ్యక్షుడు ఎర్రసాని నాగభూషణం, పెదకాకాని మండల అధ్యక్షులు వీర్ల వెంకటేశ్వరరావు, కసుకరు గ్రామ అధ్యక్షుడు ఎలవర్తి వెంకటేశ్వరరావు, వీర మహిళ నాయకురాలు ఆడేళ్ల వసంతి మరియు పట్టణ కమిటీ సభ్యులు జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.