ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి జనసేన పార్టీ తరపున పోరాడతాం

నరసాపురంలో అంగన్వాడీలు నిర్వహిస్తున్న సమ్మె 8వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా నరసాపురం సబ్ కలెక్టర్ వారికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నరసాపురం నియోజకవర్గ ఇంచార్జి బొమ్మిడి నాయకర్ మరియు ఏలూరు నియోజకవర్గ ఇంచార్జి రెడ్డి అప్పల నాయుడు మరియు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు అంగన్వాడీలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకర్ మాట్లాడుతూ వారి సమస్యలు తీర్చేవిధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి జనసేన పార్టీ తరపున పోరాడతాం అని అంగన్వాడీలకు హామీ ఇచ్చారు.