నాదెండ్ల మాట కాకినాడ సిటీలో అందరి నోట

కాకినాడ సిటీ: జనసేన పార్టీ ఇంచార్జ్ మరియు రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముత్తా శశిధర్ ఆదేశాలతో నాదెండ్ల మనోహర్ మాట కాకినాడ సిటీలో అందరి నోట కార్యక్రమం సోమవారం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ మరియు ఆకుల శీనుల ఆధ్వర్యంలో స్థానిక 39వ డివిజన్లో సుబ్బయ్య హోటల్ సెంటర్ వద్ద జరిగింది. ఈ సందర్భంగా ఆకులు శ్రీను మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి చేసిన మోసాలని కాకినాడ ప్రజలందరికీ తెలిపే విధంగా కార్యక్రమాలు చేపడతామని తన ఇష్టానుసారంగా ప్రజలు సొమ్మును దోచుకుంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న చీకటి పరిపాలన తరిమికొడతామని హెచ్చరించారు. రాష్ట్ర సమ్యుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న అక్రమాలు అన్ని రాష్ట్ర ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని వైసిపి విముక్తాంధ్రప్రదేశ్ కోసం జనసైనికులు అంతా కలిసికట్టుగా పనిచేసి రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి అక్రమాలు, నవరత్నాల పేరుతో చేస్తున్న మోసాలు తెలియజేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, జిల్లా కార్యదర్శి బడే కృష్ణ, నాయకులు శ్రీమన్నారాయణ, వాసిరెడ్డి సత్యకుమార్, బ్రహ్మాజీ, సతీష్, మనోహర్ గుప్త, వరద దొరబాబు, పిల్లా రాము, గిరి, యశ్వంత్, వాసిరెడ్డి సతీష్, సాయి యాదవ్, వీరమహిళలు సుజాత, మరియ, దీప్తి, చోడిపల్లి సత్యవతి, రమణమ్మ, ఉమా, వరిపల్లి ప్రసాద్, డాక్టర్ బాబు, గరగా శీను తదితరులు పాల్గొన్నారు.