యల్లటూరు శ్రీనివాస రాజు ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరికలు

ఉమ్మడి కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి ఉమ్మడి కడప జిల్లా రాజంపేట పట్టణం లోని వివిధ పార్టీల ప్రముఖ నాయకులు రాజంపేట జనసేన పార్టీ నేత‌ యల్లటూరు శ్రీనివాస రాజు ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ నేత యల్లటూరు శ్రీనివాస రాజు రాజంపేట పట్టణం యల్లటూరు భవన్ జనసేన పార్టీ కార్యాలయం నందు వారికి జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాజంపేట జనసేన పార్టీ నేత యల్లటూరు శ్రీనివాస రాజు మాట్లాడుతూ రాజంపేట పట్టణం నుంచి వివిధ పార్టీల నాయకులు జనసేన పార్టీకి మద్దతుగా వచ్చినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ జనసేన పార్టీ గెలుపుకు కృషి చేయాలని కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పార్టీలో తగిన స్థానం కల్పిస్తామని జనసేన మరియు టిడిపి ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక ప్రజల సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని ప్రజలకి మీ ద్వారా నమ్మకం, భరోసా ఇవ్వాలని తెలిపారు. కొత్తగా చేరిన వారిలో రాజంపేట కాపు వైసిపి నాయకులు మరియు రాజంపేట కాపు సంక్షేమ సేన వర్కింగ్ ప్రెసిడెంట్ ఆకుల చలపతి, బలిజ నాయకులు భీమినేని రమేష్, గాజుల చిన్న కుళాయప్ప, కుప్పాల మల్లికార్జున, షేక్ దర్బార్,షేక్ జాబీద్ బాషా, నూర్బాషామౌల, పటాన్ మౌలానా, సీమకుర్తి శివుడు, రుద్రరాజు లక్ష్మీ కర్ సాయి రాజు, ముమ్మడి రాజు శివశంకర రాజు తదితరులు చేరారు.