జనసేన ఆధ్వర్యంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు
సత్తెనపల్లి నియోజకవర్గం: దూళిపాళ్ల గ్రామంలో జనసేన పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెలుగుదేశం పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ ఇంచార్జి కన్నా లక్ష్మి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన క్రిస్ మస్ కేక్ ను కట్ చేసిన జనసేన పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయ కర్త బొర్రా వెంకట అప్పారావు, తెలుగుదేశం పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ ఇంచార్జి కన్నా లక్షి నారాయణ. ఈ సందర్బంగా బొర్రా మాట్లాడుతూ.. నేను ఎవరికి సహాయం చేసినా కూడా ఆ ఏసుప్రభు నన్ను ప్రేరే పించాడు కాబట్టే పేదలకు సహాయం చేస్తూ ఉంటాను. నేను సహాయం ఎవరికైనా చేశానని బయటికి చెప్పుకోను. మన వల్ల అందరూ బాగుండాలి, మనకున్న దానిలో పేదలకు సహాయం చేస్తే ఆ యేసుక్రీస్తు మనల్ని చల్లగా చూస్తాడు. ఏసుక్రీస్తు చూపిన బాటలో మనమంతా నడవాలని సర్వమానవాళి సుఖసంతోషాలతో ఉండాలని ఆ దేవదేవుని ప్రార్ధిస్తున్నామని తెలిపారు. ఈ సందర్బంగా కన్నా మాట్లాడుతూ.. దూళిపాళ్ళలో జనసేన సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయ కర్త బొర్రా వెంకట అప్పారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకలు జరపడం చాలా సంతోషకరం. యేసుక్రీస్తు ప్రజలందరికి మేలు చేసేలా చూడాలని, సుఖశాం తులతో వర్ధిల్లాలని కోరుకుంటున్నని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి సాంబశివరావు, సత్తెనపల్లి పట్టణ 7వార్డు కౌన్సిలర్ రంగిశెట్టి సుమన్, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యుడు బత్తుల కేశవ, సత్తెనపల్లి మండల అధ్యక్షులడు నాదెండ్ల నాగేశ్వరావు, నకరికల్లు మండల అధ్యక్షురాలు తాడువాయి లక్ష్మి, తెలుగుదేశం పార్టీ మండల నాయకులు, ఇతర తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు గట్టు శ్రీదేవి, చిలక సత్యం, చిలక పూర్ణ, రఫీ, ఖాసీం ఇతర జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-19-at-9.16.08-PM-1024x629.jpeg)