మదనపల్లిలో జనసేన, టిడిపి ఉమ్మడి ప్రచారం
మదనపల్లి నియోజకవర్గం: రాజా నగర్ మొదటి గ్రాస్ లో జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు ఆధ్వర్యంలో జనసేన టిడిపి ఉమ్మడి ప్రచార కార్యక్రమం చేపట్టడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా రామాంజనేయులు మాట్లాడుతూ గౌతమి స్కూల్ కి అనుకొని పెద్ద డంపింగ్ యార్డ్ ఉండడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ పరిస్థితితో పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు. చెత్త పన్ను వసూలు చేస్తున్న ఈ ప్రభుత్వం బడి పక్కనే చెత్త వేయడం అనేది ఎంతవరకు సమంజసం?.. కేవలం బడి పిల్లలకే కాకుండా చుట్టుపక్కల వీధులకు కూడా భయంకరమైన కుళ్లిపోయిన చెత్తతో దుర్గంధం వెదజల్లుతున్న పరిస్థితి. ప్రభుత్వము విద్యార్థుల ఆరోగ్యముపై దృష్టి చూపాలని జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి సుకన్య, కవిత, ప్రసన్న, మాధవిలత, మమత, జనసైనికులు ధరణి, శివ, బహదూర్, శంకర, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-20-at-6.33.18-PM-1024x683.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-20-at-6.33.15-PM-2-1024x683.jpeg)