నాదెండ్ల మాట కాకినాడలో అందరి నోట

కాకినాడ సిటీ: జనసేన ఇంచార్జ్ ముత్తా శశిధర్ ఆదేశాల మేరకు నాదెండ్ల మనోహర్ మాట కాకినాడలో అందరి నోట కార్యక్రమం రామకృష్ణారావుపేటలో జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కాములు చేయడంలో జగన్మోహన్ రెడ్డి మించిన వారు ఈ ప్రపంచంలో లేరని ఆఖరికి అధికారిక లెక్కల ప్రకారం ఇచ్చే పెన్షన్ లో కూడా తప్పుడు లెక్కలు ఇస్తూ ఈ నెలలో సుమారు 19 వేల పెన్షన్లు నిలిపేసారని ఈ విషయాన్ని గణాంకలతో సహా నాదెండ్ల మనోహర్ గారు ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగిందని అంటూ, ఆయన ఇలాంటి ప్రభుత్వం అధికారంలో ఉంటే ప్రజలు అంధకారంలోకి వెళ్లిపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని గద్దెదిగడం జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం అని ఆయన ధీమ వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు ఆకులు శ్రీనివాస్, వాసిరెడ్డి సతీష్ కుమార్, బ్రహ్మాజీ, చంటి రెడ్డి, సాయి యాదవ్, రామారావు, సత్య కుమార్ తదితరులు పాల్గొన్నారు.