కరాటి విద్యార్థులకు ఆర్థిక సహాయం

  • రాజంపేట జనసేన పార్టీ అసెంబ్లీ ఇన్చార్జి మలిశెట్టి వెంకటరమణ

రాజంపేట: ఓపెన్ ఇంటర్నేషనల్ టైక్వాడ్ కరాటి పోటీలకు మన రాజంపేట నుండి 7 గురు కరాటి విద్యార్థులు కలకత్తాకు కాంపిటీషన్ లో పాల్గొంటున్న సందర్భంగా రాజంపేట జనసేన పార్టీ అసెంబ్లీ ఇన్చార్జ్ మలిశెట్టివెంకటరమణను ఉద్దండపు బాలాజీ, రెడ్డి ప్రవీణ్ కరాటి ట్రైనర్స్ సంప్రదించి ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం చేయమని కోరారు. ఈ సందర్భంగా ట్రైనర్స్ను సన్మానించి విద్యార్థులతో కలిసి ఆర్థిక సహకారం 15000 అందించడం జరిగింది. ఈ సందర్భంగా మలిశెట్టి వెంకటరమణ మాట్లాడుతూ విద్యార్థులకు మనోధైర్యాన్ని నింపి గేమ్స్ లో విజయం సాధించి మీ తల్లిదండ్రులకు మన రాజంపేటకు గుర్తింపు తేవాలని కోరడం జరిగింది. అలాగే క్రీడలు మానసిక వికాసాన్ని మనోధైర్యాన్ని పెంచుతాయని సమాజానికి ఒక మంచి పౌరులను అందిస్తాయని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోపి, కొత్తూరు వీరయ్య ఆచారి, పోలిశెట్టి శ్రీనివాసులు, కిషోర్, జనసేన వీరమహిళలు పోలిశెట్టి రజిత, జెడ్డా శిరీష, తదితరులు పాల్గొన్నారు.