క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న జోతుల

పిఠాపురం నియోజకవర్గం: పిఠాపురం మార్కెట్ వద్ద గల హార్వెస్ట్ స్కూల్ నందు హ్యాపీక్రిస్మస్ కార్యక్రమానికి శుక్రవారం స్కూల్ యాజమాన్యం వడిశెట్టి మోహనరెడ్డి ఆహ్వానం మేరకు జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు ముఖ్యాతిధిగా హజరైయి వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ముందు సభలో పాల్గొని హ్యాపీక్రిస్మస్ కార్యక్రమం సందర్భంగా పాల్గొన్న సంఘకాపారులకు, పాస్టర్లు, అతిధితులకు, సభికులుకు, ఉపాద్యాయిని, ఉపాద్యాయులకు, నాన్ టిచింగ్ ఉద్యోగులకు క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేశారు. క్రిస్మస్ ఉత్సవాలు సందర్భంగా ఏర్పాటు చేసిన కేకు కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్ని, అనంతరం హార్వెస్ట్ స్కూల్ యాజమాన్యం వడిశెట్టి మోహనరెడ్డి పేద, బడుగు వర్గాల వారికి ఏర్పాటు చేసిన వస్త్రా (దుప్పట్లు, చీరలను)లను పంపిణీచేశారు. అనంతరం జ్యోతుల శ్రీనివాసుకి హార్వెస్ట్ స్కూల్ యాజమాన్యం తరుపున వడిశెట్టి నారాయణరెడ్డి జ్ఞాపిక అందజేశారు. అనంతరం జరిగిన విందు కార్యక్రమంలో వడిశెట్టి నారాయణరెడ్డి, పిఠాపురం మున్సిపాల్ 2వ వార్డు కౌన్సిలర్ సౌజన్య, మేడిబోయిన సత్యనారాయణ, ఆకుల వెంకటస్వామి, కొలా నాని తదితరులు పాల్గొన్నారు.