బొల్లవరంలో గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్

నందికొట్కూరు నియోజకవర్గం: నందికొట్కూరు మండలంలో గల బొల్లవరం గ్రామంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఆర్.సి.ఎం చర్చి సంఘం నిర్వహించింది. ఈ టోర్నమెంట్ లో గ్రామంలోని 6 టీమ్ లు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమాన్ని జనసేన తెలుగుదేశం పార్టీ సమన్వయ సభ్యులు నల్లమల రవికుమార్ విచ్చేసి బ్యాట్ ట్రయల్స్ ఆడి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోని 6 టీమ్ లకు 6 గురు కెప్టెన్లుగా అశోక్, చిన్న, రమేష్, వంశీ, శివ మరియు సురేందర్ నిర్వహించారు. పల్లెటూర్లలో పండుగలు వస్తే ప్రతి ఒక్కరు ఆటపాటలతో సంతోషంగా జరుపుకుంటారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా బొల్లవరం గ్రామంలో యువకులు అందరూ కలిసి ఆట పాటలతో ఆనందంతో కలిసిమెలిసి జరుపుకున్నారు.