19వ డివిజన్ ఆత్మీయ సమావేశం

విజయవాడ తూర్పు నియోజకవర్గం జనసేన పార్టీ 19వ డివిజన్ అధ్యక్షులు వటాల హరిప్రసాద్ ఆధ్వర్యంలో డివిజన్ నాయకుల మరియు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త & రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు పాల్గొని డివిజన్ సమస్యలపై మరియు రాబోయే సార్వతిక ఎన్నికల గురించి, బూత్ కమిటీ గురించి దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీమతి పోతిరెడ్డి అనిత, వటాల మణి, 21 వ డివిజన్ అధ్యక్షులు పోతిరెడ్డి రమణ గారు, 19వ డివిజన్ ఉపాధ్యక్షులు తోట యుగంధర్ & షేక్ రౌఫ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి కమ్మిలి వెంకటరమణ, కార్యదర్శి వేణు, డివిజన్ కమిటీ సభ్యులు, డివిజన్ నాయకులు, వీర మహిళలు, జనసైనికులు, కార్యకర్తలు పాల్గొన్నారు.