కొండ్రం గ్రామంలో ఘనంగా వంగవీటి రంగా విగ్రహ ఆవిష్కరణ
- బడుగు బలహీన వర్గాలకు మేలు చేసిన మహా వ్యక్తి రంగా
అనకాపల్లి నియోజకవర్గం: వంగవీటి రంగా 35 వర్ధంతి సందర్భంగా అనకాపల్లి నియోజకవర్గం, కొండ్రం గ్రామంలో వంగవీటి రంగా విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు ప్రస్తుత టిడిపి ఎమ్మెల్యే గౌరవనీయులు గంటా శ్రీనివాసరావు, కాపు సంక్షేమ సేన ఉత్తరాంధ్ర ఇన్చార్జ్ గుర్రాల శ్రీనివాసరావు, కాపు సంక్షేమ సేన రాష్ట్ర మహిళా వింగ్ కరణం కళావతి ముఖ్య అతిథిలుగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే కార్యక్రమంలో వంగవీటి రంగాని ఉద్దేశించి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు చేసిన మహా వ్యక్తి అని మాట్లాడడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-26-at-6.32.15-PM-461x1024.jpeg)