అగ్నిప్రమాద బాధితులకు అండగా జనసేన ఎంపిటిసి

అమలాపురం మండలం, నడిపూడి పంచాయతీ, చప్పుడు వారి పాలెంలో అగ్నిప్రమాదానికి గురైన బాధితులకు చిందాడగరువు జనసేన పార్టీ ఎంపిటిసి మోటూరి కనకదుర్గ వెంకటేశ్వరరావు ఆర్ధిక సహాయంతో చీరలు దుప్పట్లు పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో నల్లా బ్రహ్మాజీ, దుర్గారావు గ్రామపెద్దలు తదితరులు పాల్గొన్నారు.