పీలేరులో జనసేన-టిడిపి ఇంటింటి ప్రచారం

పీలేరు నియోజకవర్గం, పీలేరు పాత బస్టాండ్ లో జనసేన-టిడిపి ఉమ్మడిగా ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. టిడిపి ఇన్చార్జి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కలప రవి, మండల ప్రధాన కార్యదర్శి గజేంద్ర, నవీన్, హరీష్, కార్యదర్శి నరేష్, రమణ, చరణ్, రెడ్డప్ప యోగేంద్ర మరియు జనసేన కార్యకర్తలు, టిడిపి కార్యకర్తలు పాల్గొని గడపగడప కార్యక్రమంలో ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తామని సంక్షేమ సంక్షేమ పదాలు ఇస్తామని ప్రతి ఇంటికి న్యాయం జరిగే విధంగా ప్రభుత్వ తరఫున మీరు ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని త్వరలో ఇంటికి పంపించేసి ప్రజా రంజిక పరిపాలన మీకు అందిస్తామని మేము భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి-జనసేన కార్యకర్తలు భారీగా పాల్గొనడం జరిగింది.