పితాని ఆధ్వర్యంలో వైభవంగా నూతన సంవత్సర వేడుకలు

ముమ్మిడివరం నియోజకవర్గం: ముమ్మిడివరం జనసేన పార్టీ కార్యాలయం నందు సోమవారం జనసేన పార్టీ పిఎసి సభ్యులు మరియు నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ముమ్మిడివరం కార్యాలయం నందు పితాని కేక్ కట్ చేసి జనసేన శ్రేణులందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల అధ్యక్షులు,మండల కమిటీ సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు అభిమానులు అందరూ అధికసంఖ్యలో పాల్గొని పితానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు.