ఏ పి ల్యాండ్ టైటిల్ చట్టం 2022 ను వెంటనే రద్దు చేయాలి?: చిర్రి బాలరాజు

ఏ పి ల్యాండ్ టైటిల్ చట్టం 2022 ను వెంటనే రద్దు చేయాలని గత 9 రోజులుగా చేస్తున్నటువంటి దీక్షలో భాగంగా మంగళవారం పోలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి చిర్రి బాలరాజు, మండల అధ్యక్షులు పసుపులేటి రాము, కొయ్యలగూడెం మండల అధ్యక్షులు తోట రవి, మండల ప్రధాన కార్యదర్శి ప్రగడ రమేష్ దీక్షలో పాల్గొని వారికి మద్దతు తెలిపారు. నిర్వీర్యం చేసే చట్టాల రద్దు చేయాలని, ప్రజల ఆస్తులకు భద్రతలేని చట్టాన్ని రద్దు చేయాలని, ఏపీ ల్యాండ్ టైటిల్ చట్టాన్ని రద్దు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు టిఎస్ఎన్ మూర్తి, నిమ్మగడ్డ రాంబాబు, మానికాల సూరిబాబు సిహెచ్ డివి కోటేశ్వరరావు, కే వెంకటేశ్వరరావు, బలుసు శ్రీనివాసరావు, ఎం నాగులు, జువ్వల బాబ్జి, రామలక్ష్మీ, సిహెచ్ రాము తదితరులు దీక్షలో పాల్గొన్నారు.