నూతన సంవత్సర కానుకలు అందించిన డి.యం.ఆర్.

అమలాపురం: జనసేన పార్టీ నాయకులు డిఎంఆర్ శేఖర్ క్రిస్మస్ మరియు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని అమలాపురం పట్టణ మరియు ముమ్మిడివరం నియోజకవర్గాల్లోని వివిధ చర్చిల్లో పేద వృద్దులకు చీరలు పంచిపెట్టారు. అమలాపురం పట్టణం 9వ వార్డు సాయమ్మ పేటలో గల చర్చి నందు, అలానే ముమ్మిడివరం నియోజకవర్గం పశువుల్లంక చర్చి నందు సుమారు 150 మంది పేద వృద్దులకు చీరలు పంచారు. ఈ సందర్భంలో చర్చి పాస్టర్స్ శేఖర్ దంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో శేఖర్ సతీమణి దుర్గా భవానీ, కారెం వెంకట్రావు, డాక్టర్ సెల్ రాష్ట్ర కార్యదర్శి నాగమానస, కర్రి లక్ష్మీ దుర్గ, పరమట చిట్టిబాబు, వీరు పైబోడి, గొకరకొండ భాస్కర్, పరమట సింగ్ మరియు స్ధానిక సంఘ సభ్యులు రాజు పాల్గోన్నారు.