అన్నమ్మ ఘాటీ ప్రాంతంలో ప్రజా చైతన్య పోరాటం యాత్ర

కాకినాడ సిటి: జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు కాకినాడ సిటీ ఇంచార్జ్ ముత్తా శశిధర్ సూచనలతో డివిజన్ నాయకురాలు చోడిపల్లి సత్యవతిల ఆధ్వర్యంలో అన్నమ్మ ఘాటీ ప్రాంతంలో ప్రజా చైతన్య పోరాటం యాత్ర జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ శ్రేణులు ఈ ప్రాంతంలో తిరుగుతూ ప్రజా సమస్యలను వాకబు చేసారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు వానలు వస్తే రోడ్డ్లు మునిగిపోతున్నాయనీ, కాలవల్లో పూడికలు తీయడం చేయట్లేదని దీనివల్ల దోమలు రోగాలు ప్రబలుతునాయని మొత్తుకుంటున్నా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేదనీ, అసలు మనం ఏయుగంలో ఉన్నామో అర్ధం కావడంలేదన్నారు. ఈప్రభుత్వానికి పాలనకంటే రాజకీయాలే ముఖ్యమైపోయిందనీ, పాలన అంటే పత్రికా ప్రకటనలకి పరిమితమైపోయిందని దుయ్యబట్టారు. లోగడ సామెత చెప్పినట్లు కొండ నాలికకి మందు వేస్తే ఉన్న నాలిక ఊడిపోయిందన్నట్టు పేరుకి కొన్ని పధకాలు కొంతమందికి ఇస్తూ కోట్లాదిమందిపై పన్నులు వేసి ప్రజల నడ్డి విరుస్తున్నారనీ ఈ అవినీతి ప్రభుత్వ పనులని ప్రజల్లో చేరవేయడం తమ బాధ్యతగా తీసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో దీప్తి, ధనలక్ష్మి, చోడిపల్లి సత్యవతి, బండి సుజాత, సోనీ ఫ్లోరెన్స్, ఉమా, రవణమ్మ, రత్నం తదితరులు పాల్గొన్నారు.