మైలవరం మండలంలో గ్రామ కమిటీలు ప్రకటించిన జనసేన

మైలవరం: మైలవరం స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు మైలవరం నియోజకవర్గం ఇంచార్జ్ అక్కల రామ్మోహన్ రావు(గాంధీ) మరియు జనసేనపార్టీ మైలవరం మండల అధ్యక్షులు శీలం బ్రహ్మయ్య, మైలవరం మండలంలో 12 గ్రామకమిటీలు ప్రకటించారు. ఈ సందర్భంగా అక్కల గాంధీ మాట్లాడుతూ గ్రామ అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్న ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలని, పార్టీని గ్రామస్థాయిలో పటిష్ట పరిచే విధంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కొత్తగా నియమించబడ్డ గ్రామ అధ్యక్షులు పాల్గొన్నారు. నియమించబడ్డ గ్రామ అధ్యక్షుల వివరాలు:- మైలవరం కు-గజరావు పద్మావతి, చండ్రగూడెంకు- ఆయంచ శివరాం ప్రసాద్, పుల్లూరు-1కు-ఎడ్ల మధుబాబు, పుల్లూరు2కు-కర్నే రాంబాబు, మరుసుమల్లికి-మోదుగు గాంధీ, పొందుగల కు- పసుపులేటి నాగరాజు, వెల్వడం-ఆనం అభినేష్, గణపవరంకు-తాళ్ల శివకృష్ణ, చంద్రాలకు-గుణదల నాగయ్య, వెదురుబిడంకు-వీర్ల పౌల్ రాజ్, కీర్తిరాయినిగూడెంకు-తోట మాధవరావు, తోలుకోడుకు-సుంకర సత్యనారాయణ గ్రామ అధ్యక్షులుగా మరియు కమిటీ సభ్యులను నియమించడం జరిగింది.