మున్సిపల్ కార్మికుల ధర్నాకు మద్దతుగా రామదాస్ ఆధ్వర్యంలో వంట-వార్పు

మదనపల్లి, మున్సిపల్ కార్మికులు చేస్తున్న ధర్నాకు మద్దతుగా జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్ గంగారపు రామదాస్ ఆధ్వర్యంలో శుక్రవారం మున్సిపల్ వర్కర్స్ కి వంట-వార్పు కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా రాయలసీమ కో-కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి మాట్లాడుతూ పారిశుధ్య కార్మికుల న్యాయమైన డిమాండ్ల కోసం గాంధీయ మార్గంలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న కార్మికులకు నా వ్యక్తిగతంగాను మరియు వారి పోరాటంలో నేను కూడా తుది దశ వరకు జనసేన పార్టీ మదనపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ గా సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు. ఈ విషయాలు అన్నిటిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెల్లి రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ సంక్తీర్ణ ప్రభుత్వంలో వీరి డిమాండ్లను నెరవేర్చేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, రాష్ట్ర చేనేత విభాగ ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, పట్టణ అధ్యక్షులు నాయని జగదీష్, రూరల్ అధ్యక్షులు గ్రానైట్ బాబు, రామసముద్రం మండలం ఉపాధ్యక్షులు గడ్డం లక్ష్మిపతి, లవన్న, రాజారెడ్డి, సెక్రటరీ నాగవేణి, గంగులప్ప, ప్రధాన కార్యదర్శి జంగాల గౌతమ్, ప్రధాన కార్యదర్శి గండికోట లోకేష్, సెక్రటరీ అర్జున, ప్రధాన కార్యదర్శి నవాజ్, సెక్రటరీ జనర్దన్, దినకర్, సత్య, నవీన్ తదితరులు పాల్గొన్నారు.