బహుజన సమాజ్ పార్టీ మద్దతు కోరిన రామదాస్ చౌదరి
మదనపల్లి, శుక్రవారం బి.ఎస్.పి పార్టీ కార్యాలయంలో బందెల గౌతమ్ ని జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి ఆధ్వర్యంలో జనసేన నాయకులు, కార్యకర్తలు మరియు వీరమహిళలతో కలసి రాబోయే ఎన్నికలలో జనసేన-టీడీపీ ఉమ్మడి అభ్యర్థికి బహుజన సమాజ్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇవ్వమని కోరారు. ఈ సందర్భంగా గంగారపు రామదాస్ చౌదరి మాట్లాడుతూ అన్ని అర్హతలు ఉన్న మదనపల్లిని జిల్లా కేంద్రంగా ప్రకటించడాన్ని పెద్దిరెడ్డి ఫ్యామిలి అడ్డుకొందని వచ్చే ఎన్నికల్లో వైస్సార్సీపీ పార్టీలో ఏ అర్హత లేకున్నా కోట్లు కోట్లు ముట్టచెప్తే టిక్కెట్లు ఇచ్చేస్తారని సదుంలో రాజకీయాలు జరుగుతున్నాయని ఈసారి మదనపల్లిలో జనసేన-టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించి పవన్ కళ్యాణ్ కి కానుకగా ఇస్తామని అన్నారు. ఈ సందర్భంగా బందెల గౌతమ్ మాట్లాడుతూ రామదాస్ చౌదరి అన్న మమ్మల్ని కలవడం మా మద్దతు కోరడానికి వచ్చినందుకు సంతోషం తెలిపారుస్తూ, బహుజన సమాజ్ పార్టీ అధిష్టానం నాయకులతో చర్చించి వారి అభిప్రాయలను స్వీకరించి త్వరలోనే మా నిర్ణయం తెలియజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, రాష్ట్ర చేనేత విభాగ ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, పట్టణ అధ్యక్షులు నాయని జగదీష్, రూరల్ అధ్యక్షులు గ్రానైట్ బాబు, రామసముద్రం మండలం ఉపాధ్యక్షులు గడ్డం లక్ష్మిపతి, లవన్న, రాజారెడ్డి, సెక్రటరీ నాగవేణి, గంగులప్ప, ప్రధాన కార్యదర్శి జంగాల గౌతమ్, ప్రధాన కార్యదర్శి గండికోట లోకేష్, సెక్రటరీ అర్జున, ప్రధాన కార్యదర్శి నవాజ్, సెక్రటరీ జనర్దన్, దినకర్, సత్య, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-05-at-15.44.23-1024x577.jpeg)