కాకినాడ సిటిలో మీకోసం జనసేన

కాకినాడ సిటిలో జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ ఆధ్వర్యంలో రామకృష్ణారావు పేట ప్రాంతంలో మీకోసం జనసేన అంటూ డోర్ టు డోర్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాసిరెడ్డి శివ డివిజనులోని ప్రజలను కలుస్తూ నేడు జరుగుతున్న దారుణాలు, ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరిస్తూ పవన్ కళ్యాణ్ సారధ్యంలో జనసేన పార్టీ ఏవిధంగా వీటిపై పోరాటం చేస్తోందో వివరించారు. ప్రజల పక్షాన జనసేన నిలిచిందనీ రాబోయే ఎన్నికలలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీల కూటమికి తమ మద్దతునిచ్చి ప్రజా పాలనను తీసుకురాడానికి తోడ్పదవలసినదిగా కోరుతు ప్రచారం సాగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అట్ల సత్యన్నారాయణ, డివిజన్ నాయకులు డాక్టర్ బాబు, కసుమూర్ ఖాన్, జడ రాజు, మొయినుద్దీన్, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.