ప్రమాదానికి గురైన జనసేన కార్యకర్తకు అండగా నిలిచిన డా. గౌతమ్ రాజు
యర్రగొండపాలెం: ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదానికి గురైన చాట్లమడ గ్రామం జనసేన క్రియాశీలక సభ్యుడు జెడ్డా వెంకటేష్ ఆరోగ్యం గురించి తెలుసుకున్న జనసేన పార్టీ ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ పాకనాటి గౌతమ్ రాజు స్పందించి వెంకటేష్ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ఆర్థిక సహాయం చేయటం జరిగింది. ఆదివారం వెంకటేష్ ని వారి కుటుంబాన్ని పరామర్శించిన జనసేన పార్టీ ప్రకాశం జిల్లా జాయింట్ సెక్రెటరీ కె.చిన్న పాల్ మరియు ప్రకాశం జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు జానీ, జనసేన పార్టీ నాయకులు మాకం సందీప్ జెడ్డా రాజు, సురేష్, పాపయ్య బాలు నాయక్, రాములు, సురేష్ తదితరులు వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేసి వారికి ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-07-at-4.38.45-PM-768x1024.jpeg)