కన్నుల పండుగగా రామచంద్రుని శోభాయాత్ర

ఉమ్మడి కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం: శ్రీరామచంద్రుల వారి జన్మభూమి అయోధ్య రామ మందిరం నిర్మాణం పూర్తి చేసుకుని 2024 జనవరి 22వ తేదీన జరగబోవు శ్రీరామచంద్రుల వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా నందలూరు మండలంలో ఆదివారం శోభాయాత్ర ప్రారంభించడం జరిగింది. ఈ శోభాయాత్రకు రాజంపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు యల్లటూరు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో రథం మరియు రథం అలంకరణకు సహకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారి తమ్ముడు మాజీ జెడ్పిటిసి యల్లటూరు శివరామరాజు, మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్, మాజీ జెడ్పిటిసి షబ్బీర్ అహ్మద్, ఆకుల చలపతి, గురువిగారి వాసు, బుచ్చిరెడ్డి, ప్రవీణ్, పులి నరసింహులు మరియు కమిటీ సభ్యులు మస్తానయ్య, డాక్టర్ అరిగెల రాంబాబు, నరసింహ శెట్టి, హెచ్డి ప్రసాద్, బాలాంజినేయులు, శివశంకర్, మోడపోతుల రాము తదితరులు పాల్గొన్నారు.