బెంతు ఒరియా సామాజిక వర్గానికి న్యాయం చేయాలి

ఇచ్ఛాపురం నియోజకవర్గం: ఇచ్ఛాపురంలో గల బెంతు ఒరియా సామాజిక వర్గానికి న్యాయం చేయాలంటూ చేస్తున్న దీక్ష 11 వ రోజుకి చేరింది. రిలే నిరాహారదీక్షలో కుల పెద్దలు, యువత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన లక్ష్యం కుల పత్రలు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చేంత వరకు తగ్గేది లేదని న్యాయం కోసం ఉద్రిక్తం చేస్తామని ఆ వర్గంలో ముక్త కంఠం వినిపిస్తుంది. మా సామాజిక వర్గం పట్ల ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వైఖరిని కులపెద్దలు పాండు దళాయి, సుదర్శన్ బిసాయి, జయసేన్ బిసాయి, మేఘనత్ బిసాయి ముండి పడ్డారు. రాజ్యాంగం కల్పించిన హక్కుని కాలరాయోద్దు అని ప్రశ్నించారు.