నందికొట్కూరులో జనసేన-టిడిపిల ఆత్మీయ సమావేశం

నందికొట్కూరు పట్టణంలోని ఏ.బి.ఎం పాలెంలో శనివారం రాత్రి జరిగిన ఆత్మీయ సమావేశ కార్యక్రమంలో భాగంగా సీ.ఎస్.ఐ. పాలెం మరియు ఏ.బీ.ఎమ్ పాలెం జనసేన మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం జనసేన పార్టీ పుష్పరాజు, శ్యామ్ అలాగే తెలుగుదేశం పార్టీ కళాఖర్, మోహన్, రాజు, రాజేష్ తదితరుల ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన-తెలుగుదేశం పార్టీ సమన్వయ సభ్యులు నల్లమల రవికుమార్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు జాకీర్ హాజరవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఆ యొక్క ఏరియాలో సమస్యలపైన మరియు ఎన్నికల్లో భాగంగా ఏవిధంగా ముందుకు వెళ్లాలి అనే విషయాలపై చర్చించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నుండి నవీన్ రెడ్డి, మద్దిలేటి, జలీల్, చిన్న, మాధవరం రాజు, రవి, స్వరూప్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు దేశం పార్టీ నుండి అయ్యారజు, సాగర్, ధర్మ, సుదర్శనం తదితరులు పాల్గొన్నారు.