పేరుపాలెం నార్త్ లో నాయకర్ సతీమణి బొమ్మిడి సునీత పర్యటన

నరసాపురం: మొగల్తూరు మండలం, పేరుపాలెం నార్త్ పంచాయితీ గ్రామంలో శ్రీకృష్ణ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపురం నియోజకవర్గం జనసేనపార్టీ ఇంచార్జ్ బొమ్మిడి నాయకర్ సతీమణి బొమ్మిడి సునీత. ఈ కార్యక్రమంలో ఆమె గ్రామంలోని ప్రతి ఇంటికీ తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని ప్రజలు అనేక సమస్యలను సునీత గారికి వివరించారు. అనంతరం బొమ్మిడి సునీత మాట్లాడుతూ.. పేరుపాలెం నార్త్ పంచాయితీ అభివృద్ధికికి చాలా దూరంగా ఉందని, స్థానిక ప్రభుత్వం ఈ పంచాయితీని నిర్లక్ష్యం చేసిందని, రాబోయే ఎన్నికలలో జనసేన – తెలుగుదేశం పార్టీల ఐక్యతతో ఏర్పడే ఉమ్మడి ప్రభుత్వంలో తప్పనిసరిగా ఈ పంచాయితీని అభివృద్ధి చేస్తామని బొమ్మిడి సునీత తెలిపారు. ఈ కార్యక్రమంలో పేరుపాలెం నార్త్ పంచాయితీ సర్పంచ్ పేరుపాలెం వెంకన్న, వార్డు మెంబర్ తోట వెంకటేష్, పంచాయతీ బోర్డు మెంబెర్ లు, పేరుపాలెం నార్త్& సౌత్ పార్టీ ప్రెసిడెంట్ గుండబత్తుల బాబీ, అందే జగదీశ్, యాత్ ప్రెసిడెంట్ కొప్పర్తి సత్యనారాయణ, వైదాని నాగరాజు కొప్పినేని భోగేశ్వరారావు, రెడ్డియ్య నాయుడు పాల్గొన్నారు.