మీకోసం జనసేన డోర్ టు డోర్ కార్యక్రమం

కాకినాడ సిటి: జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ నాయకులు వార్ఫ్ రోడ్ ప్రాంతంలో రాష్ట్ర సమ్యుక్త కార్యదర్శి వాశిరెడ్డి శివ ఆధ్వర్యంలోను, 44వ డివిజన్లో భీష్మరాజు ఆధ్వర్యంలోను, 22వ డివిజన్లో కుమారస్వామి ఆధ్వర్యంలోను, 20వ డివిజనులో దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలోను మీకోసం జనసేన అంటూ డోర్ టు డోర్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ రాష్ట్ర సమ్యుక్త కార్యదర్శి వాశిరెడ్డి శివ ఆయాప్రాంతాలలోని ప్రజలను కలిసి వై.సి.పి ప్రభుత్వ అక్రమాలను, కుంభకోణాలను వివరించారు. ప్రజా సంక్షేమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారనీ, చెత్త పన్ను, కరెంటు బిల్లులు, ఆర్టీసీ రెట్లు ఇలా అన్నిరకాలుగా పీడించుకుతింటున్నారని దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామనీ, ప్రజల పక్షాన జనసేన నిలిచిందనీ రాబోయే ఎన్నికలలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీల కూటమికి తమ మద్దతునిచ్చి ప్రజా పాలనను తీసుకురాడానికి తోడ్పడవలసినదిగా కోరుతూ ప్రచారం సాగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అట్ల సత్యన్నారాయణ, దుర్గాప్రసాద్, భీష్మరాజు, కుమారస్వామి, షమీర్, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.