సమగ్ర శిక్షా, కాంట్రాక్టు ఉద్యోగుల దీక్షకు జనసేన మద్దతు
కాకినాడ ధర్నా చౌక్ లో నిరవధిక సమ్మె చేస్తున్న సమగ్ర శిక్షలో పని చేస్తున్న కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ మరియు పార్ట్ టైం ఉద్యోగుల దీక్ష శిభిరాన్ని సందర్శించి వారికి జనసేన పార్టీ తరపున సంపూర్ణ మద్దతు తెలియచేసిన జనసేన పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ.. ఈ సందర్బంగా వారితో మాట్లాడుతూ మీ న్యాయమైన డిమాండ్ లను మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తెలియచేస్తా అని మరియు మీ డిమాండ్లు పరిష్కారంఫై వైసీపీ ప్రభుత్వం స్పందించి సమస్యలు తీర్చాలని, లేని పక్షంలో జనసేన, టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత మీకు తగిన న్యాయం చేస్తామని తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-08-at-9.18.06-PM-1024x462.jpeg)