జనసేన ఆధ్వర్యంలో రాజంపేటలో మెగా క్రికెట్ టోర్నమెంట్

  • కడప జిల్లాలోనే మొట్టమొదటిసారిగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో మెగా క్రికెట్ టోర్నమెంట్

రాజంపేట: జనసేన పార్టీ సమన్వయకర్త అతికారి దినేష్ ఆధ్వర్యంలో టి సుండుపల్లి మరియు వీరబల్లి మండలంలో జనసేన మెగా క్రికెట్ టోర్నమెంట్ ను మంగళవారం అతికారి దినేష్ ముఖ్య అతిథిగా క్రికెట్ టోర్నమెంట్ అంగరంగ వైభవంగా ప్రారంభించారు. కడప జిల్లాలోని మొట్టమొదటిసారిగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ క్రికెట్ పోటీలలో దాదాపు 25 జట్లు పాల్గొంటున్నాయి చివరగా ఫైనల్లో తలపడే రెండు జట్లకు మొదటి బహుమతిగా 30 వేల రూపాయలు రెండవ బహుమతిగా 15 వేల రూపాయలు మరియు టోర్నమెంట్ కప్పును అందజేయనున్నారు ప్రతి మ్యాచ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచినా ఆటగాడికి వెయ్యి రూపాయలు బహుమతి కూడా ఇస్తున్నారు. ఈ సందర్భంగా అతికారి దినేష్ మాట్లాడుతూ ఈ మెగా టోర్నమెంట్ ద్వారా ప్రతిభా గల యువకులను ప్రోత్సహించి క్రికెట్ క్రీడలో రాణించే విధంగా అన్ని విధాలుగా అండగా ఉంటామని రాజంపేట నియోజకవర్గం తరుపున క్రికెట్లో రాణించే విధంగా అన్ని సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టి సుండుపల్లి, వీరబల్లి మండలాల జనసేన నాయకులు జనసైనికులు టోర్నమెంట్ నిర్వాహకులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.