డోర్ టు డోర్ పవన్ కళ్యాణ్ సంక్రాంతి శుభాకాంక్షలు

కాకినాడ సిటి: జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ నాయకులు గాంధీనగర్ ప్రాంతంలో ఒడిదల కాశీ & ఆకుల శ్రీను ఆధ్వర్యంలోను, కుమ్మరిపేట ప్రాంతంలో కుమారస్వామి ఆధ్వర్యంలోను, మహలక్ష్మి నగర్ ప్రాంతంలో శివక్రిష్ణ ఆధ్వర్యంలోను జనంలోకి జనసేన మరియు పవన్ కళ్యాణ్ గారి సంక్రాంతి శుభాకాంక్షలు అంటూ డోర్ టు డోర్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ శ్రేణులు ప్రజలకు మొదటిగా తమనాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరపున సంక్రాంతి శుభాకాంక్షలను తెలియచేస్తూ స్వీట్స్ అందచేసారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వలనలో చేస్తున్న అక్రమాలు, అస్థవ్యస్థ నిర్ణయాలతో సామాన్యులే కాక మొత్తం ప్రజానీకం అంతా ఆందోళన చెందుతూ భయం భయంగా బతుకుతున్నారనీ, మేలు చేయకపోయినా పరవాలేదు కీడు చేయకుండా ఉంటే అదే పదివేలు అనుకునే కాలం దాపురించిందని వాపోతునారనీ, రానున్న కాలం ప్రజల కష్టాలు తీరి ఈ ప్రజాకంటక వై.సి.పి ప్రభుత్వం పీడ పోతాదని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ రాబోయే ఎన్నికలలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీల కూటమికి తమ మద్దతునిచ్చి ప్రజా పాలనను తీసుకురాడానికి తోడ్పడవలసినదిగా కోరుతూ ప్రచారం సాగించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.