జనసేన ఆధ్వర్యంలో అమలాపురంలో ముగ్గుల పోటీలు!

అమలాపురం: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జనసేన పార్టీ నిర్వహిస్తున్న మన ఊరు మన ఆట’ కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కేంద్రం అమలాపురంలో శుక్రవారం ముగ్గుల పోటీలు నిర్వహించిన జనసేన పార్టీ అమలాపురం పార్లమెంట్ ఇంచార్జి డిఎంఆర్ శేఖర్ పార్టీ సీనియర్ నేతలు నల్లా శ్రీధర్, యాళ్ళ నాగ సతీష్. మన తెలుగింటి సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ పోటీలు నిర్వహించబడింది. పోటీలలో గెలుపొందిన మహిళలకు ప్రథమ బహుమతిగా 5వేల రూపాయలు, ద్వితీయ బహుమతిగా 3వేల రూపాయలు, తృతీయ బహుమతిగా 2వేల రూపాయలు నగదు బహుమతి అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి డిఎంఆర్ శేఖర్ అందజేశారు. అధేవిధంగా పోటీలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికీ ప్రోత్సాహక బహుమతి అందజేశారు. నియోజకవర్గంలోని మహిళలు, జనసేన వీరమహిళలు ఈ పోటీల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.