రాబోయేది జనసేన, టీడీపీల ప్రజా ప్రభుత్వం

  • అయ్యా హిజ్రాల మంత్రి నువ్వు దోచుకుంది దాచుకుంది చాలు.. కాకాని నిన్ను సర్వేపల్లి ప్రజలు ఇంటికి పంపించడం ఖాయం
  • సర్వేపల్లి నియోజకవర్గంలో కొనసాగుతున్న జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు పాదయాత్ర

సర్వేపల్లి నియోజకవర్గం: సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు చేపట్టిన విజయ యాత్ర ఐదవ రోజైన ఆదివారం వెంకటాచలం మండలంలోని ప్రసిద్ధిగాంచిన గొలగమూడి క్షేత్రం నుంచి బయలుదేరి కాకుటూరు పరిశ్రమల కేంద్రం వద్ద ఉన్న అడివిలోని శివాలయం, ఆ తర్వాత ప్రముఖ పుణ్యక్షేత్రమైన కసుమూరు మస్తాన్ స్వామి దర్గాకు చేరుకుంది. ఈ విజయ యాత్ర ముఖ్య ఉద్దేశం సర్వేపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాలలోని 10 పుణ్యక్షేత్రాలు, 120 కిలోమీటర్లు, రేపు జరగబోయే ఎన్నికలలో జనసేన తెలుగుదేశం పార్టీలు కలిసి ఉమ్మడి అభ్యర్థిని విజయవంతంగా అత్యధిక మెజార్టీతో గెలిపించే విధంగా ఆ భగవంతుని సంకల్పంతో ప్రతి మండలంలో కూడా 13 గ్రామాలను కలుపుతూ కొనసాగుతున్నటువంటి ఈ విజయాత్ర సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధికి, 117 పంచాయతీల అభివృద్ధికి, పేద బడుగు బలహీన వర్గాలకు అండగా అన్ని విధాలుగా ఆదుకోవడం విజయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ హిజ్రాల మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఐదేళ్లు ప్రతిపక్షంలో, మరో ఐదేళ్లు అధికార పక్షంలో ప్రజల సొమ్ము, ఖనిజ సంపదను దోచుకుని దాచుకుంది చాలు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మంత్రి కాకానిని సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు ఇంటికి సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారు. మంత్రి కాకాని లక్ష్యం ఒకటే సర్వేపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కాదు. ప్రతిపక్షాలపై బురద జల్లడం, దుష్ప్రచారం చేయడం, అసభ్యకర రీతిలో తిట్టడం తప్ప. పేద ప్రజలకు చేసిందేమి లేదు. కాకాని దోచుకున్న వేల కోట్ల రూపాయల సొమ్మును టీడీపీ, జనసేన పార్టీలు కలిసి స్థాపించే ప్రజా ప్రభుత్వంలో తిరిగి కక్కిస్తాం. బడుగు బలహీన వర్గాల పై కాకాని చేయించిన దాడులు, దౌర్జన్యాలు, ఆ కారణంగా నష్టపోయిన వారి పాపాలను కాకాని నువ్వు మూటకట్టుకున్నావు. సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రజా ప్రభుత్వంలో టీడీపీ, జనసేన పార్టీలు కలిసి చేస్తాయి. ఈ కార్యక్రమంలో వీరమహిళ గుమినేని వాణి భవాని, వెంకటాచలం మండలం కార్యదర్శి శ్రీహరి, చెంచయ్య కార్యదర్శి కాకి శివ, రవి, ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు రహీం మస్తాన్ గిరీష్ పసుపులేటి మురళి వంశి తదితరులు పాల్గొన్నారు.