వైసీపీ జి.ఓలు భోగి మంటల్లో ఆహుతి

కాకినాడ సిటి: సంక్రాంతి పండుగ సందర్భంగా కాకినాడ సిటి ప్రజలకు జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ శుభాకాంక్షలు తెలియ చేశారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలతో కాకినాడ సిటీ ఇంచార్జ్ ముత్తా శశిధర్ సూచనల మేరకు ప్రజలను పట్టి పీడించేలా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలపై చెత్తపన్ను వేసి, ఆస్థిపన్నులు పెంచి, వాహనాలపై దారుణంగా గ్రీన్ ట్యాక్స్ వేసి, కరెంటు చార్జీలు పెంచుతూ ఇలా జారీచేసిన జి.ఓలని మన నాయకులు శ్రీ. పవన్ కళ్యాణ్ గారు మరియు నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న విధంగా భోగి మంటల్లో ఆహుతిచేసి రాబోయే ఉగాదికి వీటిని సరిదిద్దేందుకు జనసేన తెలుగుదేశం పార్టీల కొత్త ప్రభుత్వానికి మద్దతు తెలుపుదామన్న ముత్తా శశిధర్ పిలుపుతో ఆదివారం కాకినాడ సిటిలో 44 వ డివిజనులో అగ్రహారం సతీష్ వారి మిత్రబృందం మెహర్ నగర్ ప్రాంతంలోను, 12వ వార్డు సంజయ్ నగర్ ప్రాంతంలో సాయం సాయికుమార్ మరియు వారి మిత్రబృందం, కొత్త కాకినాడ ప్రాంతంలో సతీష్ కుమార్ ఆధ్వర్యంలోను, 41వ డివిజనులో సత్యకుమార్ ఆధ్వర్యంలో ఒంటిమామిడి జంక్షన్లోను, గాంధీనగర్ ప్రాంతంలో కోటేశ్వరరావు ఆధ్వర్యంలోను, రామక్రిష్ణారావు పేటలో జాడా రాజు ఆధ్వర్యంలోను, గుడారిగుంట ప్రాంతంలో టి.వి.వి సత్యన్నారాయణ అధ్వర్యంలోను ఈ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ శ్రేణులు హలో ఏ.పి.. బై బై వై.సి.పి అని నినాదాలు ఇస్తూ తమ నిరసనని ప్రకటించారు. ఈ కార్యక్రమాలలో వాశిరెడ్డి సత్యకుమార్, ఎం.టి. బ్రహ్మాజీరావు, ఎస్. రమణ, టి.రాజా, ఎం. దుర్గాప్రసాద్, టి.వి. రమణమూర్తి, టి. సత్యనారాయణ, తుమ్మలపల్లి సీతారాం, రావిపాటి వెంకటేశ్వరరావు, తోరం చిరంజీవి, తుమ్మలపల్లి వీరభద్రరావు, గంధం నాగబాబు, శెట్టి జోగిరాజు, తుమ్మలపల్లి వీర అరుణ్ శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.