యాదవోలులో మన ఊరు మన ఆట సంక్రాంతి సంబరాలు

గోపాలపురం నియోజకవర్గం: జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు గోపాలపురం నియోజకవర్గం, దేవరపల్లి మండలం, యాదవోలు గ్రామంలో మన ఊరు మన ఆట సంక్రాంతి సంబరాల్లో భాగంగా భోగి పండుగ రోజున ఆడవారికి యువతులకు ముగ్గుల పోటీలు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో గెలుపొందిన వారికి విజేతలకు బహుమతుల ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గోపాలపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ దొడ్డిగర్ల సువర్ణ రాజు, గోపాలపురం నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు అనిశెట్టి గంగరాజు, యాదవొలు జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు శ్రీనివాస్, యాదవొలు గ్రామ జనసేన పార్టీ ఉపాధ్యక్షులు ముమ్మడి బాలకృష్ణ, కాపు సంక్షేమ సేన తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి మధు అనిశెట్టి, తాత బాబు, డేగల రమణ, బల్లే సతీష్, రావుల సతీష్, అనిశెట్టి వరలక్ష్మి, వంకాయల సత్తిపండు, బల్లే వీరబాబు, దొరబాబు, కిరణ్, సామంత్, దాదాపుగా 200 మంది జనసైనికులు, యాదవొలు గ్రామ మహిళలు, యువతులు, వీరమహిళలు 300 వరకు ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో ప్రతి ఒక్కరు వారి వంతు సహకరించారు.