జీలుగుమిల్లిలో జనసేన ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

పోలవరం: సంక్రాంతి సంబరాల్లో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జీలుగుమిల్లి మండల కేంద్ర బ్యాంక్ అఫ్ బరోడా వీధిలో మండల అధ్యక్షులు పసుపులేటి రాము, లిటిల్ స్టార్స్ యూత్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, మ్యూజికల్ చైర్స్, లెమన్ స్ఫూన్స్ పలు క్రీడా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు ఆసక్తిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవి కుమార్, పోలవరం నియోజకవర్గం ఇంచార్జి చిర్రి బాలరాజు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. పాల్గొన్న మహిళలందరికి ప్రోత్సాహ బహుమతులు అందజేశారు. రైతులు అందరూ కష్టపడి పండించిన పంట ఇంటికి తీసుకు వచ్చి కుటుంబంతో కలిసి చేసుకునేది సంక్రాంతి అని, జూదం జోలికి వెళ్లి జీవితాలు నాశనం చేసుకోవద్దని, రంగువల్లులు, క్రీడా పోటీలు నిర్వహించాలనే గొప్ప ఉద్దేశంతో సంక్రాంతిని అందరం సంతోషంగా జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రూపా సత్యనారాయణ, వీరంకి వెంకటేశ్వరావు కోలా ధర్మరాజు, కోలా మధు, సూరిశెట్టి మహేష్, శేఖముడి సాయి, శేఖర్, నారగాని నరేంద్ర, సోడిశెట్టి రమ్య దుర్గా, సోడిశెట్టి సుభాష్, ఉలవల ముత్యం, నేలటూరు అప్పారావు, ఉర్ల బాబీ, ఉలవల శివ, మహిళలు, కార్యకర్తలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.