నూజివీడు సమస్యలపై జనసేన వినతి పత్రం

నూజివీడు నియోజకవర్గం: నూజివీడు సబ్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ ని జనసేన పార్టీ తరఫున ముత్యాల కామేష్ మర్యాదపూర్వకంగా కలిసి నూజివీడు నియోజ కవర్గంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల బ్యానర్లు ఫ్లెక్సీలు తొలగించాలని, 1991 వ సంవత్సరంలో శంకుస్థాపన చేయబడిన ఇండోర్ స్టేడియాన్ని తక్షణమే పూర్తి చేయాలని, నూజివీడు పట్టణం ప్రధాన రహదారులు విస్తరించాలని, నూజివీడు డివిజన్ లో పనిచేస్తున్న పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అందరికీ నూజివీడు పట్టణంలో ఇంటి స్థలాలు ఇవ్వాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నూజివీడు మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షులు ఇంటూరి చంటి తదితరులు పాల్గొన్నారు.