రా తరలి రా భారీ బహిరంగ సభను విజయవంతం చెయ్యండి

  • పాడేరు జనసేన పార్టీ ఇన్చార్జ్ డా. వంపూరు గంగులయ్య

పాడేరు నియోజకవర్గం: రా తరలి రా భారీ బహిరంగ సభను విజయవంతం చెయ్యండి అని పాడేరు జనసేన పార్టీ ఇన్చార్జ్ డా. వంపూరు గంగులయ్య పిలుపునిచ్చారు. బుధవారం ఆయన మీడియా ముఖంగా మాట్లాడుతూ అల్లూరిసీతారామరాజు జిల్లా, జనసేన పార్టీ పాడేరు నియోజకవర్గ నాయకులకు, వీరమహిళలు, జనసైనికులకు విజ్ఞప్తి జనవరి 20 తేదీన అరకులో పార్లమెంట్ స్థాయిలో మరియు పార్లమెంట్ హెడ్ క్వార్టర్ లో జనసేన పార్టీ మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ నాయకులు రా.. తరలి రా.. అంటూ బారి బహిరంగ సభకు పిలుపునిచ్చారు. తెదేపా నాయకులు ఈ సభ నిర్వహించబోతున్నారు. ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. అలాగే మన పార్లమెంట్ పరిధిలో గల వివిధ నియోజకవర్గాల జనసేనపార్టీ ఇన్చార్జ్ లు, పార్టీ సమన్వయకర్తలు విధిగా హాజరై సభ వేదికనలంకరించనున్నారు. మన పాడేరు నియోజకవర్గంలో నుంచి కూడా అశేష సంఖ్యలో జనసైనికులు, వీరమహిళలు, వివిధ మండలాల అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఈ సమావేశానికి హజరవ్వాలని వంపూరు గంగులయ్య పిలుపు నిచ్చారు.