మునికూడలి గ్రామంలో జనంకోసం జనసేన మహాపాదయాత్ర

  • జన నీరాజనాలతో ముందుకు సాగిన పాదయాత్ర
  • జనం చూపు జనసేన వైపు
  • తోట పవన్ కుమార్ కి బ్రహ్మరధం పట్టిన గ్రామ ప్రజలు

రాజానగరం: జనం కోసం జనసేన మహాపాదయాత్రలో భాగంగా సీతానగరం మండలం, మునికూడలి గ్రామంలో పర్యటించిన జనసేన పార్టీ యువజన నాయకులు తోట పవన్ కుమార్. కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ప్రతీ ఇంటికీ వెళుతూ ప్రతీ ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ రాబోయే ఎన్నికలలో జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇచ్చి రాష్ట్రంలో నెలకొన్న రాక్షస పాలన అంతమొందించి ప్రజా పరిపాలన తీసుకురావాలని అభ్యర్థిస్తూ జనసేన పార్టీ కరపత్రం, బ్యాడ్జ్, కీ చైన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు భారీగా పాల్గొన్నారు.