వైసిపి ఓటమి మా లక్ష్యం: చిల్లపల్లి శ్రీనివాసరావు

  • సోషల్ మీడియా కధనాలపై ఖండించిన మంగళగిరి జనసేన ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు
  • రాబోయే ఎన్నికల్లో ఉమ్మడిగా పోరాటం చేసేందుకు సిద్ధం మంగళగిరి అభివృద్ధికి కోసం కలిసి పని చేస్తాం

మంగళగిరి: జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో శనివారం మంగళగిరి ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు.. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు అవస్థవాలు. పవన్‌కళ్యాణ్‌ గారి అడుగు జాడల్లో మేము ముందుంటాము. పవన్‌కళ్యాణ్‌ గారి ఆదేశాలతో పార్టీకి అంకిత బావంతో పనిచేస్తున్న తరుణంలో ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని. తప్పుడు ఆరోపణలు, ప్రచారం చేయాలంటే వాటికి సంబందించిన పూర్తి ఆధారాలతో నిరుపించండి. తప్పుడు ఆరోపణలు కాదు కేవలం వైసీపీని రాష్ట్రం నుంచి తరిమేయాలనేదే తమ ప్రధాన అజెండా. అభ్యర్థి ఏవరనేది తమకు ముఖ్యం కాదు అని కేవలం వైసీపీపై మాత్రమే తమ పోరాటం. కలిసి పనిచేయాలనే దృఢమైన సంకల్పంతో ముందుకు పోతున్నాము. కావాలనే దుష్ప్రచారం చేయిస్తున్నారు. పార్టీలో కోవర్టులపై ప్రశ్నించగా పార్టీలో కొందరు తమకు అవకాశం లేదని అందులో కొందరు ప్రయత్నం చేయటం సర్వసాధారణం. పార్టీ కోసం పనిచేసే సమయంలో కొందరు దూకుడు ప్రయత్నం చేయటంలో రాజకీయ కోణంలో అలా అనటం వలన కొందరు ఆవేదన పార్టీలో విభేదాలు శృష్టించేలా ఉంటే దాన్ని మరోలా చూడవద్దని, జనసేన టిడిపి ఉమ్మడిగా ఎప్పుడు కలిసికట్టుగా ముందుగా నడుస్తుందని. జనసేన – టిడిపి కలిసి రాష్ట్రంలో రాక్షస పాలన చేస్తున్న వైసిపి ప్రభుత్వాన్ని పాలు ద్రోలే వరకు మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న జనసేన నాయకులు, కార్యకర్తలు పార్టీ ఆదేశాలకు కట్టుబడి పనిచేస్తామని, రానున్న రోజుల్లో ఇరువురు కలిసి నగరంలో పర్యటిస్తామని అని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయ శేఖర్, చేనేత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్వతం మధు, గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, మంగళగిరి మండల అధ్యక్షులు వాసా శ్రీనివాసరావు, తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.