ఆవుల వెంకటేశ్వర్లుకు నివాళులు

నకరికల్లు మండలం, కుంకలగుంట గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకులు ఆవుల శ్రీనివాసరావు తండ్రి ఆవుల వెంకటేశ్వర్లు మరణించిన వార్త తెలుసుకున్న సత్తెనపల్లి నియోజకవర్గం సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు అందుబాటులో లేని కారణంగా అందుబాటులో ఉన్న నాయకుల్ని పంపించడం జరిగినది. పార్ధివ దేహాన్ని సందర్శించి, నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి వెంకట సాంబశివరావు, నకరికల్లు మండల అధ్యక్షులు తాడువాయి లక్ష్మీ శ్రీనివాస్, సత్తెనపల్లి రూరల్ మండల అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరావు, రాజుపాలెం మండల అధ్యక్షుడు తోట నరసయ్య, ముప్పాళ్ళ మండల అధ్యక్షులు సిరిగిరి పవన్ కుమార్, గుల్లపల్లి గ్రామ అధ్యక్షుడు నక్క వెంకటేశ్వర్లు పాల్గొని నివాళులు అర్పించడం జరిగింది.