దుర్గాడ ఏకాహాం కార్యక్రమంలో పాల్గొన్న జ్యోతుల శ్రీనివాసు

పిఠాపురం నియోజవర్గం: గొల్లప్రోలుమండలం, దుర్గాడ గ్రామం కొత్తపేట రామాలయం నందు సోమవారం అయోధ్యలో బాలరాముడి విగ్రహప్రాణ
ప్రతిష్ట సందర్భంగా దుర్గాడ గ్రామంలో ఏకాహాం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొత్తవీధి రామాలయం ఆలయకమిటీ వారు ఆహ్వానం మేరకు జ్యోతుల శ్రీనివాసు సోమవారం ఉదయం 6:30 గంటల సమయంలో కొత్తపేట రామాలయంనకు విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని అనంతరం రామాలయం నందు గల సీతారామాంజనేయ లక్ష్మణ, భరతశత్రుఘ్నులను దర్శనం చేసుకోని అనంతరం ఏకాహాం కార్యక్రమంలో పాల్గొని వారితో కలిసి భజనకార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మేడిబోయిన సత్యనారాయణ, శాఖ సురేష్, ఇంటి నాగేశ్వరరావు, శాఖ బాబులు, జీలకర్ర కృష్ణ, మేడిబోయిన నాగేశ్వరరావు, నేరియ్య, గుండ్రా కృష్ణ, వడ్లమూరి రమణ, శాఖ అప్పారావు తదితరులు ఉన్నారు.