వంగవీటి రంగా విగ్రహ ప్రతిష్ట భూమిపూజలో పాల్గొన్న అళహరి సుధాకర్

కావలి: వంగవీటి మోహన రంగా గారి విగ్రహ ప్రతిష్టకి భూమి పూజా కార్యక్రమము సోమవారం అంగరంగ వైభవంగా కావలి ట్రంక్ రోడ్డులో శ్రీ కృష్ణదేవరాయ విగ్రహానికి ఎదురుగా జరిగింది. చీఫ్ గెస్ట్ గా వంగవీటి నరేంద్ర, అతిధులుగా జనసేన ఇంఛార్జి అళహరి సుధాకర్, కావలి ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, కావ్య కృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమము బ్రాహ్మణుల వేదమంత్రాల మధ్య జరగడము విశేషం. వక్తలు మాట్లాడుతూ రంగా గారి జీవిత చరిత్రను, బడుగు బలహీన వర్గాలవారికి వారు అందించిన ఆదరణను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా అళహరి సుధాకర్ మాట్లాడుతు ఎన్నో ఏళ్ళగా వంగవీటి మోహన రంగా గారి విగ్రహ ప్రతిష్టకు జరిగిన చర్చలో భాగంగా నేను పాల్గొన్నాను, అదీ ఈ రోజు అక్కడ అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రతిష్ట ఇక్కడ రంగా గారి విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ ఎంతో సంతోషకరమైన రోజు అని విగ్రహ ప్రతిష్టకు అత్యధికఒకా ఇంత కంటే ఎక్కువ మంది పాల్గొని రంగ రంగ వైభవంగా జరుపుకోవాలని ఆశించారు.